సాయి గాయత్రి పాఠశాలలో లో మెగా వైద్య శిబిరం
మునగాల 12 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండలం మునగాల గ్రామంలోని విద్యాలయాలు మార్చి 13వ తారీకు శుక్రవారం రోజున సాయి గాయత్రి విద్యాలయ మరియు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయినది ఈ శిబిరంలో గుండె షుగర్ మరియు రంగా లకుచెందిన వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించబడును ECG,2D ECHO మరియు BMD టెస్టు లు ఉచితంగా చేయబడును. కావున మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాయి గాయత్రి విద్యాలయ ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుము గాని ఆధార్ కార్డు గానీ అవసరం లేదు ఈ శిబిరంలో పాల్గొనాలనుకునేవారు సాయి గాయత్రి విద్యాలయ లో పేర్లు నమోదు చేసుకుని శుక్రవారం ఉదయం 10 గంటలకు పాఠశాల వద్దకు వచ్చి పరీక్షలు చేయించుకోవలసినదిగా మనవి .