భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 14
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగాపలువేడుకల్లోపాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు MLC శంకర్ నాయక్ మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారుఅనంతరం మిర్యాలగూడ పట్టణంలోని పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలకుపూలమాలలువేసి నివాళులు అర్పించారు
అనంతరం దామరచర్ల మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా,, బి ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరుకులమత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని
దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది
అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది
మన జీవన శైలిలో మార్పులు రావాలి మన భవిష్యత్తు మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధం అని బోధించిన మహనీయులు అంబేద్కర్
కేవలం ఒక జాతిలో ఒక కులానికోఒకమతానికో చెందిన వారుకాదుమన భారత జాతి సంపద వారు మన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి వారు ప్రతీ ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, కౌన్సిలర్ కొమ్ము శ్రీను, దళిత సంఘాల నాయకులు డాక్టర్ రాజు,బెజ్జం సాయి, నూకపంగ శ్రవణ్, తలకొప్పుల సైదులు, వివిధ సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఎల్ బ్రదర్స్ పాల్గొన్నారు.