పత్తి రైతులకు పరిహారం ఇవ్వాలి. మంద శ్రీనాథ్
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంద శ్రీనాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు రావలసిన దిగుబడి కేవలం రెండు నుంచి మూడు క్వింటాలు మాత్రమే వస్తుందని అన్నారు. ఎకరానికి రూపాయలు 20, 000 చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.