మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
చిన్నంబావి12నవంబర్2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల తాసిల్దార్ కే శ్రీనివాస్,చిన్నంబావి మండల ఎంపీడీవో సూర్ణ ఆదర్శ్ గౌడ్,సింగల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి,చిన్నంబావి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని వ్యవసాయ అధికారులను ఆరా తీయగా 9500 ఎకరాల్లో సాగు చేసినట్లు బదులిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ తమకు మొక్కజొన్న పంటను విక్రయించేందుకు చిన్నంబావిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం దూరం అయిందని, అయ్యవారిపల్లి లో మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రైతుల విజ్ఞప్తి ని సంబంధిత మార్క్ఫెడ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. వెలుగొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఐ ద్వారా బోధన చేసేందుకు తరగతి గదుల్లో సరిపడు కంప్యూటర్లతో పాటు, అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో పీఎం శ్రీ కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నమారూర్ గ్రామానికి చెందిన 10 మంది రైతులు రెవెన్యూ రికార్డుల్లో భూమి తమ పేరిట ఎక్కలేదని భూ భారతి రెవెన్యూ సదస్సు లో అర్జీ పెట్టుకున్నారు. 201 సర్వేనెంబర్ లో 7 ఎకరాల 26 గుంటల భూమికి సంబంధించి వారు పెట్టుకున్న అర్జీకి సంబంధించి కలెక్టర్ బుధవారం క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ చేశారు. అర్జీదారుల సమస్యపై రికార్డులను పరిశీలన చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ కే శ్రీనివాస్, ఎంపీడీవో సుర్ణ ఆదర్శ్ గౌడ్, ఎంపీఓ రామస్వామి, మండల అధికారులు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.