బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.
నాగారం జూన్ 23:- నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ ఆదివారం బాధిత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తోడుసు లింగయ్య నాయకులు గంగిబిక్షం రమేష్ యాదగిరి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.