ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తో దద్దరిల్లిన కరెక్ట్ రేట్

ఐఎంఏ అనుచిత వ్యాఖ్యలు ఉపసరించుకోవాలి

Mar 27, 2024 - 16:35
Mar 27, 2024 - 17:44
 0  9
ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తో దద్దరిల్లిన కరెక్ట్ రేట్

మునగాల 27 మార్చి 2024  తెలంగాణవార్త ప్రతినిధి:- జర్నలిస్టులపై ఐఎంఏ వారి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఐక్య జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య జర్నలిస్టుల సంఘం నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులను ఐఎంఏ వారు నల్ల గొర్రెలతో పోల్చడం ఖండిస్తున్నామని అన్నారు.వెంటనే వారి మాటలు ఉపసంహరించుకొని తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని జర్నలిస్టుల జేఏసీ హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ లత కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు..

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State