పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే సహించబోము . ఏఐఎస్ఎఫ్ - ఏఐవైఎఫ్

జోగులాంబ గద్వాల 13 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురించేస్తే సాహించేది లేదని ప్రైవేటు స్కూలు యాజమాన్యం ఫీజులపేరుతో వేధింపులు చేస్తే ధర్నాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పేరు కృష్ణ లు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్,కృష్ణ లు మంగళవారం నాడు సిపిఐ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులకు సకాలంలో హాల్ టికెట్లు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి DEO కూడా విద్యార్థులకు ఎలాటి ఇబ్బందులకు గురి చేయకుండా హాల్ టికెట్లు ఇచ్చేందుకు ఆదేశాలు జారిచేయాలనీ డిమాండ్ చేశారు. పరీక్షల సమయం లో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయకుండగా స్కూలు ఫీజు కట్టలేదనో,హాజరు శాతం లేదనో, వివిధ రకాల కారణాల చేత విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదని సూచించారు.
విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే డీఈఓ ని కాని విద్యార్ధి సంఘాలను కాని సంప్రదించాలి అని తెలిపారు.
ఈసందర్బంగా విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో AIYF డివిజన్ అధ్యక్షులు సుంకులమ్మ మెట్టు మహేష్,AISF జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్, AiSF AIYF నాయకులు రాఘవ, అంజి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.