నీటిలో మునిగి తేలాడుతున్న పట్టించుకోని అధికారులు

జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలం .మల్లెందొడ్డి గ్రామంలోని అధిక వర్షాల కారణాలవల్ల నీటిలో మునిగితేలాడుతున్న రైతు కురువ నడ్డి తిమ్మప్ప గుడిసె నీళ్లు చేరినాయి చుట్టూ నీళ్లు ఆగిపోయినావి ఆ ఇంటిలో ముగ్గురు ఉంటున్నారు కన్న బాలింత తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు నిద్ర పోవాలన్నా కూడా నీళ్లు ఎక్కడికి వరకు వస్తావో గుడిసె మొత్తానికి మునిగే పరిస్థితి ఏర్పడుతుందేమో భయంగా ఉంది ఇప్పుడు వరకు ఎమ్మార్వో ఆర్ ఐ ఎంపీడీవో ఎవ్వరు కూడా ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదు అని రైతు కురువ నడి తిమ్మప్ప తెలిపారు . ఎవరు కూడా పట్టించుకోకుండాఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రైతు కురువ నడ్డి తిమ్మప్ప ఇంటి చుట్టూ నీళ్లు లేకుండా మొరం కొట్టించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.