టి యు డబ్ల్యూ జే ఐజేయు మునగాల మండల కమిటీ ఎన్నిక

Feb 20, 2024 - 17:48
Feb 20, 2024 - 18:06
 0  3
టి యు డబ్ల్యూ జే ఐజేయు మునగాల మండల కమిటీ ఎన్నిక
అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల వెంకటేశ్వర్లు దామెర రవి

మునగాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- టీయూడబ్ల్యూజే ఐజేయు మునగాల మండల అధ్యక్షునిగా తుమ్మల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా దామెర రవి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తుంగతుర్తి లోని సిరి ఫంక్షన్ హాల్ లో సోమవారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా సర్వసభ్య సమావేశం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, యూనియన్ జిల్లా నాయకులు జి.ఎస్.రెడ్డి సూచన మేరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోలా నాగేశ్వరరావు, బంటు కృష్ణ లు కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలంలో యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో అధిక సంఖ్యలో సభ్యత నమోదు చేస్తామని అన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State