జిల్లా నందు త్వరలో బిపి షుగర్ స్క్రీనింగ్ క్యాంపుల తనకి :- డిఎంహెచ్వో డాక్టర్ శశికళ.
జోగులంబ గద్వాల 30 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కొత్త డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఈరోజు ఎన్సీడీ సూపర్వైజర్లకు జిల్లా నందు ప్రారంభమైన ఏఎన్ఎం స్క్రీనింగ్ అనగా 30 సంవత్సరముల పైబడిన వారందరికీ జిల్లా నందు స్క్రీనింగ్ జరుగుతున్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్సిడి సూపర్వైజర్లకు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ క్యాంపులో యందు ఆఫ్లైన్ రికార్డు మైంటైన్ చేయాలని స్క్రీనింగ్ నందు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఇచ్చిన టార్గెట్ మాత్రమే పూర్తి చేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని తెలిపారు.. రోజు జిల్లాకు రిపోర్ట్ పంపాలని మొదట ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాతనే స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు. ఇట్టి స్క్రీనింగ్ క్వాలిటీ గా చేయాలని అబ్బా కార్డు జనరేషన్ చేసి ఎన్సీడీ పోర్టల్ నందు లింక్ చేయాలని తెలిపారు.. అవసరమైనప్పటికీ వారం వారం రివ్యూ చేస్తానని తెలిపారు.. బీపీ షుగర్ ఉన్న వారందరికీ కూడా పోర్టల్ నందు అబ్బా కార్డ్స్ క్రియేట్ చేయాలని తెలిపారు..