జాకారం మరియు గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలి

Jul 21, 2024 - 20:56
Jul 21, 2024 - 21:10
 0  3
జాకారం మరియు గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలి

జూలై 21 ములుగు తెలంగాణవార్త:- ములుగు మండలం లోని జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు అక్కడి వరుద ఉదృతిని పరిశీలించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారి పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ రావద్దని ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఎవ్వరూ కూడా చాపల వేటకు వెళ్లవద్దని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల లో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించి విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి వర్యులు సీతక్క  సూచించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333