ఫిబ్రవరి 10న చలో ఢిల్లి మహా దర్న జేయప్రదం చేయండి
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల

భువనగిరి 31 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
జిల్లా పట్టణ కేంద్రంలో ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సురుపంగ,ప్రకాష్ వనం ఉపేందర్ చలో ఢిల్లీ మహాధర్నా పోస్టర్ విడుదల చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ 5వేలకు పెంచాలని, అంత్యోదయ రేషన్ కార్డ్స్, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజు భువనగిరిలోని స్థానిక వినాయక చౌరస్తా వద్ద పోస్టర్ విడుదల చేయడం జరిగినది.ఈ కార్యక్రమనికి జిల్లా అధ్యక్షు ప్రధాన కార్యదర్శి సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ హాజరై మాట్లాడుతూ.. దేశంలో 2011 నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 రూపాయలు మాత్రమే చేల్లిస్తుంది. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినవి. కానీ పెన్షన్స్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలి.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పతకాన్ని వికలాంగులందరికి వర్తింపచేయాలి.రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలి.2015 డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో కేంద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఫలితంగా 2024 సంవత్సరo పూర్తివుతున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం.కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్,2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.2016 ఆర్ పి డిచట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్ను రద్దు చేయాలి.2016 ఆర్ పిడి చీఫ్ కమిషనర్,నేషనల్ ట్రస్ట్ కు 10 ఏండ్ల నుండి చైర్మన్స్ నియమించడం లేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అందని ద్రాక్షగా మారుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలి.ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణ వలన వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలి.అన్ని రకాల రైలులలో వికలాంగుల ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని పునరుద్దరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొండెందుకు యుడిఐడికార్డునే గుర్తింపుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.ఈ కారిక్రములో ఎన్ పిఆర్ టి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపెల్లి స్వామి ఎన్.పి.ఆర్.డి జిల్లా కోశాధికారి కొత్త లలిత పాండాల శ్రీహరి యాదగిరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.