ఏసీబీ సోదాల వేళ అధికారుల గైర్హాజరుపై కమిషనర్ క్లారిటీ
మున్సిపల్ అధికారుల గైర్హాజరు వార్తలపై కమిషనర్ స్పందన
సూర్యాపేట మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం రేగిన వేళ మున్సిపల్ అధికారుల గైర్హాజరు వార్తలపై కమిషనర్ హనుమంత రెడ్డి స్పష్టతనిచ్చారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఉదయం 10:30 దాటినా పలువురు అధికారులు కార్యాలయానికి రారంటూ కొన్ని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై స్పందించిన కమిషనర్ హనుమంత రెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సెక్షన్లలోని అధికారులు యథావిధిగా విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఆయన తెలిపారు. కేవలం ఏసీబీ సోదాలు జరుగుతున్న టీపీఓ కార్యాలయంలోని సిబ్బంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో లేరని ఆయన వివరించారు. ఈ అధికారిక వివరణతో అధికారుల గైర్హాజరుపై చెలరేగిన ఊహాగామాలకు పూర్తిగా తెరపడింది.