అలంపూర్ సబ్ -డివిజన్, విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....
జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఉండవెల్లి. నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు తేదీ: 04.04.2024 గురువారం నాడు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మానోపాడ్ మండలం లోని
1). 33/11KV జల్లాపూర్ సబ్ -స్టేషన్ నుండి వెళ్లే 11KV జల్లాపూర్ ఫీడరు పరిధిలో మరియు 33/11KV మానోపాడ్ సబ్ -స్టేషన్ నుండి వెళ్లే 11KV మానోపాడ్ ఫీడరు పరిధిలో,
అలాగే
2). వడ్డేపల్లి మండలం 33/11KV రామాపురం సబ్-స్టేషన్ నుండి వెళ్లే 11KV రామాపురం & 11KV బుడ్డారెడ్డిపల్లి ఫీడర్ల పరిధిలో ఒరిగిన విద్యుత్ స్థంబాలను సరిచేయు పనులు మరియు మిడిల్ పోల్స్ ఎత్తే పనులు అలాగే లైన్లను తాకే చెట్లకొమ్మలను తొలగించే పనులు చేయటం జరుగుతుంది.
కావున ఆయా 11KV ఫీడర్ల పరిధిలో ఉండే జల్లాపురం, చండూర్, పల్లెపాడు, బోరవెల్లి, మానోపాడ్, అమరావయ్, రామాపురం, తిమ్మాజిపల్లి మరియు బుడ్డారెడ్డిపల్లి గ్రామాలకు మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించగలరు.
విద్యుత్ శాఖ,
అలంపూర్ సబ్ -డివిజన్, వారు తెలియజేశారు.