సర్పంచుల అవగాహన సదస్సు..ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 30 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన సర్పంచ్ ల అవగాహన సదస్సు ఎంపీడీవో శంకరయ్య నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ..ఏ సర్పంచ్ అయినా గ్రామ పార్టీలకు అతీతంగా గ్రామప్రజలకు సేవ చేయడం మీ కర్తవ్యము అని అన్నారు.అనంతరం మండల పరిధిలోని 17 గ్రామాల సర్పంచులను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రేమలత,మేనేజ్మెంట్ అధికారి,హౌసింగ్ ఏఈ గోపి సింగ్,వివిధ గ్రామాల కార్యదర్శులు,సర్పంచ్ లు,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.