స్తూరబాయి  విద్యాలయం కి నీటి నిల్వచేసే నీళ్ల ట్యాంక్ వితరణ

Jan 11, 2025 - 19:23
 0  14
స్తూరబాయి  విద్యాలయం కి నీటి నిల్వచేసే నీళ్ల ట్యాంక్ వితరణ

జోగులాంబ గద్వాల 11 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- వడ్డేపల్లి స్పందించే గుణం గొప్పది 393 మంది  విద్యార్థిని లు  విద్య ను  అభ్యసిస్తున్న  వడ్డేపల్లి  కస్తూర్భా  విద్యాలయం  లో నీటిని  నిల్వ ను చేసే  నీళ్ళ ట్యాంక్  యొక్క  అవసరం ఉన్నదని తెలుసుకున్న  శాంతినగర్ సేవా సమితి సభ్యుడు *షేక్ అస్లాం షరీఫ్   1000 లీటర్ ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం  ఉన్న నీళ్ళ ట్యాంక్ ను  శనివారం   రోజు   వితరణ   చేశారు.   ఈ సందర్బంగా  కస్తూర్భా విద్యాలయం  స్పెషల్ ఆఫీసర్  పద్మ  మాట్లాడుతు " స్పందించే  గుణం  ప్రతి ఒక్కరిలో ఉండదని, సమాజంలో ఇలాంటి వారు చాలా  అరుదు గా ఉంటారని,ప్రస్తుతం నీళ్ళ ట్యాంక్ అవసరం ఎక్కువ గా ఉన్నదని, అది గుర్తించి  అస్లాం నీళ్ల ట్యాంక్ ను మా విద్యాలయం ఇవ్వడం మాకు సంతోషము అని, ఈ సందర్బంగా తనకు  కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నాం. దాతలు విద్యాలయం కు మరిన్ని  మౌళిక  వసతుల   రూపకల్పన  ముందుకు  రావాలని ఆమె  విజ్ఞపతి చేశారు. ఈ కార్యక్రమం లో సేవా సమితి  సభ్యుడు  దాసువరం నాగరాజు, కస్తూర్భా విద్యాలయం  సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333