ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.

Aug 5, 2024 - 19:50
Aug 5, 2024 - 19:52
 0  5
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి,అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి మొత్తం (28) దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి క్షుణ్ణంగా పరిశీలించి,అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు ఆర్.డి.ఓ.రామ్ చందర్,జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333