పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులను న్యాయం చేయాలి
జిల్లా ఎస్ పి సింధు శర్మ
సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి
బాన్సువాడ టౌన్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్.పి. సిహెచ్. సింధు శర్మా ఐ.పి.ఎస్
కామారెడ్డి జిల్లా స్టాఫ్ బ్యూరో :- జిల్లా ఎస్పీ సింధు శర్మా ఐ.పి.ఎస్ బాన్సువాడ టౌన్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ ఎస్ హెచ్ ఓ, బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్,సత్యనారాయణ ఎస్సైలు, ఏ ఎస్ ఐ లు హెడ్ కానిస్టేబుల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.