పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Oct 14, 2024 - 20:28
Oct 14, 2024 - 20:54
 0  84
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూర్ ఉన్నతపాఠశాలలో 2008-09లో 10 వ తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం ఆశ్వాక్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. నాటి ఉపాధ్యాయులు పుప్పాల మల్లయ్య , పజ్జూరి భిక్షం,నారాయణ రావు, సుదర్శన్, చంద్రశేఖర్ ,కిరణ్ లను పూర్వవిద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల మహేష్ ,నవీన్, మురళి, వీరభద్రి ,జనార్ధన్, మహేష్, లింగస్వామి, యాదగిరి ,శ్రీను, నరసింహ, రషీద, ప్రశాంతి, మంజుల, మౌనిక, సరిత , జ్యోతి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు