పారిశుద్దాన్ని మెరుగు పరచండి.డీ పీ ఓ

Jul 9, 2024 - 20:54
 0  6
పారిశుద్దాన్ని మెరుగు పరచండి.డీ పీ ఓ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ పారిశుద్దాన్ని మెరుగు పరిచండి :డీపీవో గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి పారిశుధ్యన్నీ మెరుగు పరచాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ ఆదేశించారు. మండలంలోని నెమ్మికల్ పశువుల సంత పరిసరాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా సంత సమీపంలోని వీదుల్లో అపరిశుభ్ర పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.అంతకు ముందు గ్రామంలో మొక్కలను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీ పి ఓ జి సురేష్ కుమార్ ,ఎం పీడీఓ ఎండి. హసీం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.