నూతనంగా నియమితులైన అధ్యాపకులకు స్వాగత సన్మానం

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ కు నూతనంగా నియమితులైన అధ్యాపకులను ఆహ్వానించి వారికి సన్మానం చేసి గ్రీన్ పెన్ను బహుకరించడం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మాట్లాడుతూ .....ఈ కళాశాల పేద విద్యార్థుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినందువల్ల వెనుకబడిన మన మండలం,జిల్లాలోని విద్యార్థులను సర్వతో ముఖాభివృద్ధి చేయడానికి అందరూ కంకణ బద్ధులై పని చేయాలని సూచిస్తూ రాబోయే సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి ఉత్తీర్ణత పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు రామాంజనేయులు గౌడ్ గోవర్ధన్ శెట్టి నరసింహులు భాగ్యలక్ష్మి మరియు అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది. New Jls names madhruri -maths ,Raghavendra-economics,Sudhakar-botany,neelaveni- zoology