తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికైన సూర్యాపేట ఉపాధ్యాయులు
nallagondajwala

సూర్యాపేట 11 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- సూర్యాపేటకు చెందిన ఉపాధ్యాయురాలు, రచయిత నల్లగొండ జ్వాలాగిరీష్ Nallagonda Jwalagirish కి “తెలుగు కీర్తి” జాతీయ ప్రతిభ పురస్కారం వరించింది. సాహిత్య రంగంలో ఆమె చేస్తున్న సేవలకు, తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యానికి నిరంతరం చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కళావేదక వారు జనవరి 21వ తేదీన విజయవాడలో తెలుగు భాష, తెలుగు సంస్కృతి,తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరంగా సాహిత్య సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలలో ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీశ్రీ కళావేదిక మరియు తెలుగు అసోసియేషన్ అప్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్బంగా పలువురు సాహితీ మిత్రులు, అభినందనలు తెలిపారు