జెఎల్ ఏం మోహిన్ ఫాషా పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన  మోత్కూర్ ఏడిఈ 

Sep 24, 2024 - 08:57
Sep 24, 2024 - 08:59
 0  10
జెఎల్ ఏం మోహిన్ ఫాషా పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన  మోత్కూర్ ఏడిఈ 

విద్యుత్ ఉద్యోగుల సంఘాల యాదాద్రి జిల్లా డివిజన్ నాయకులు 


 అడ్డగూడూరు23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం ధర్మారం జూనియర్ లైన్ మెన్ మోహిన్ ఫాషా తొమ్మిది నెలల క్రితం ఉద్యోగ రీత్యా భువనగిరి  విద్యుత్ డివిజన్ కార్యాలయం లో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తుండగా చాడ, ఆత్మకూర్ గ్రామాల మధ్యలో అదుపు తప్పి కింద పడి కోమాలోకి వెళ్లి నాడు దాదాపు డెబ్భై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు అక్కడి నుండి కొంచం కోలుకుంటున్నాడు అని పిజీ్యోతర్పి చేయుటకు నెలకు యాభై వేల జీతంతో ఒక ప్రైవేట్ డాక్టర్ ను నియమించుకొని తన స్వగ్రామం అడ్డగూడూరు మండలం చిర్రగూడూర్ లో  నిరుపేద తల్లి తండ్రులు అప్పులు చేసి చికిత్స చేయిస్తున్నారు, ఎలాగైనా తమ కొడుకును కాపాడుకోవాలి ఎన్నో  ప్రయత్నాలు చేశారు కానీ చివరగా  22 తారీకు నిన్న ఆదివారం రోజున మోహిన్ ఫాషా మృతి చెందినాడు, అతని మృతిని చూసి కన్నా వారు తమ ఒక్కగాను ఒక్క చెల్లి కన్నీటి పర్యావంతం అయినారు పేదరికం లో ఉన్న మా బిడ్డ కష్ట పడి చదువుకొని విద్యుత్ శాఖ లో ప్రభుత్వం కొలువు వచ్చింది ఇక మా కష్టాలు తిరుతాయి అని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేసినారు మోత్కుర్ అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ బాలు నాయక్ అడ్డగూడూర్ ఏఈ లు సందర్శించి పార్దివ్హా దేహాని పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రభుత్వం తరుపున కర్మ కాండ ల ఖర్చు ల నిమిత్తం ఇవ్వవలసి ఇరువై వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు మోహిన్ ఫాషా పార్దివా దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎస్సి ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘం డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ బాలెంల దుర్గయ్య, సబ్ డివిజన్ లీడర్ మాలోతు వెంకన్న 1104 యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పగిడం యాదగిరి ప్రధాన కార్యదర్శి అమరనాధ్ డివిజన్ అధ్యక్షులు ఎస్కే షకీల్,నాయకులు సత్యనారాయణ, బాబు మోత్కూర్ నాయకులు కాటం శ్రీనుతుప్పతి కృష్ణ మూర్తి మహేష్ మరియు బి సి సంఘం జిల్లా అధ్యక్షులు ధరణి కోట నరేష్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ , పులకరం శేఖర్, పురుగుల శ్రీను, శోభన్ బాబు విద్యుత్ సంఘం నాయకులు మోహిన్ ఫాషా మృత దేహానికి నివాళులు అర్పించినారు.