తెలంగాణ ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలి!

Sep 24, 2024 - 08:45
Sep 24, 2024 - 08:48
 0  11
తెలంగాణ ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలి!

2016 RPD చట్టాన్ని ఉల్లంగించిన  పాలసీ ఎమ్మెస్ ఎంఇ

భువనగిరి 23 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,2016 RPD చట్టానికి భిన్నంగా పాలసీ ఏర్పాటు చేయడం సరైంది కాదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ కమిటీ డిమాండ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు-2024పేరుతో పాలసీ ప్రకటించడం జరిగింది. 4000 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.కానీ తెలంగాణ ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు.ఎస్సీ లకు 14.94 శాతం, ఎస్టీ లకు 8.75 శాతం,ఓబిసి లకు 27.69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని పాలసీలో ప్రకటించారు. కానీ వికలాంగులకు ఇవ్వవలసిన 5 శాతం రిజర్వేషన్స్ పాలసీలో ఎందుకు ప్రకటించలేదు.దళిత, గిరిజన, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 43.02 లక్షల మంది ఉన్న వికలాంగుల అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడడం లేదు.పరిశ్రమల ఏర్పాటులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి.చట్టాలు అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంగిచడం ఎంత వరకు సమంజసం.వికలాంగులలో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి.MSME పాలసీ -2024 లో వికలాంగులను భాగస్వామ్యం చేయాలి. వికలాంగులకు భాగస్వామ్యం లేకుండా పాలసీ ఏర్పాటు చేయడం అంటే వికలాంగుల పట్ల వివక్షత పాటించడమే అవుతుంది.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం MSME -2024 పాలసీని సవరణ చేసి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని NPRD హేచ్చరిస్తుంది.ఈ కార్యక్రమములో జిల్లా కోశాధికారి కొత్త లలిత మండల నాయకులూ శ్రీహరి తదితరులు పాల్గొనడం జరిగింది .