సీఎం రిలీఫ్ ఎల్ఓసి అందజేత.
జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం పరిధిలోని చాగాపురం గ్రామానికి చెందిన నగేష్ సన్నాఫ్ మాలకేషన్న అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యే సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయలు 5 లక్షలు మంజూరు అయ్యాయి. అట్టిఎల్ఓసిని మంగళవారం ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి క్యాంప్ కార్యాలయం కర్నూలు నందు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం రిలీఫ్ ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.