గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలే ధ్యేయం సీఐ.
ఇటిక్యాల. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా సోదర భావంతో నిర్వహించేందుకు కోదండపురం పోలీస్ స్టేషన్ లో ఆలంపూర్ సర్కిల్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సై తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సిఐ వి ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటిక్యాల ఉండవెల్లి అలంపూర్ ఎస్సైలు రవి రాథోడ్ సురేష్ రామకృష్ణ పాల్గొన్నారు. సుమారు 100 మంది మండప నిర్వహకులు హాజరయ్యారు.