అతి కిరాతకంగా నరికి చంపిన దుండగులు
డి కొత్తపల్లిలో దారుణ హత్య...
అతి కిరాతకంగా చంపిన దుండగులు...
భూమి తగాదాలే హత్యకు దారి...
నాగారం 09 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా నాగారం (మం) డీ కొత్తపల్లి లో దారుణ హత్య గ్రామానికి చెందిన బయ్యo యాకస్వామి 45 తండ్రి బిక్షం ను కంచె గుట్ట క్రింద అతికిరాతకంగాగొడ్డలితో నరికి చంపిన దుండగులు వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కుటుంబ సభ్యులను పోషించుకునేది భూమి తగాదాలే ఈ హత్యకు దారి తీసాయని స్థానికుల ఆరోపణ స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు భూ తగాదాల నేపథ్యంలో పాలొల్లు గొడ్డలితో నరికి చంపినట్లు బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు గలరు మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...