శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది కలెక్టర్ కు ఫిర్యాదు.

జోగులాంబ గద్వాల 19 మే 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల శ్రీ చైతన్య హైస్కూల్ సిబ్బంది, 2025 ఏప్రిల్ నెల జీతం ఇవ్వకుండా సిబ్బందినీ వేధిస్తున్న శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుని సిబ్బందికి తగ్గిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం శ్రీ చైతన్య హైస్కూల్, గద్వాల్ బ్రాంచ్లో. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై "టాక్సిక్ వర్క్ కల్చర్ మరియు అడ్మిషన్ ఒత్తిడి మరియు ఆదివారాలు ప్రభుత్వ సెలవులు కూడా పన్ని చేయించుకొని నేటి వరకు శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం మరియు AGM భాస్కర్ రెడ్డి సిబ్బందిపై అసభ్యకరమైన దుర్భాషలాడి 2024-2025 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించి వీలైనంత త్వరగా జీతాన్ని విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నేడు జరిగిన ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.