విద్యార్థికి అండగా నిలిచిన మేడే రాజీవ్ సాగర్

Jul 30, 2024 - 21:08
Jul 30, 2024 - 21:33
 0  63
విద్యార్థికి అండగా నిలిచిన మేడే రాజీవ్ సాగర్

తిరుమలగిరి 31 జులై 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన రెడ్డిమల్ల రాజేష్ అనే విద్యార్థి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆర్టిఎల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ లో కోర్సు అభ్యసించడానికి ఆర్ధిక స్తోమత లేకపోవడంతో ,ఈ విషయం ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్  దృష్టికి తీసుక రావడం జరిగింది. ఆరు నెలల పాటు కోర్సును ప్రతి నెల 20,000 చొప్పున అభ్యసించడానికి మొత్తం లక్ష ఇరవై వేల రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. నిన్న కోర్సు పూర్తి చేసుకున్నందున సర్టిఫికెట్ రావడంతో నేడు రాజీవ్ ను కలిసి సంతోషం వ్యక్తం చేసిన రెడ్డిమల్ల రాజేష్ ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్  మాట్లాడుతూ కష్టపడి చదవడానికి అవకాశం ఉండి, ఆర్థికంగా వెనుకబడిన రాజేష్ కు చేయూతనియ్యడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో గ్రామానికి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు...

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034