రోడ్డు కి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి
జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతిది : అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామం లో ప్రధాన రహదారి ఐజ నుంచి గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్అండ్ ఆర్ సెంటర్ తోపాటు కర్ణాటక లోని పంచముఖి ఆంజనేయ స్వామి మరియు మంత్రాలయం కి ఈ రోడ్డు పై వెళ్ళుతుoటారు, ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేని కారణంగా వర్షపు నీరు, డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచి ఉండడం తో గుంతల నిండా నీరు చేరడం వల్ల ప్రజలు మరియ వాహనదారులు ఇబ్బందీ పడుతున్నారు, జిల్లా కలెక్టర్ , మరియు మండల అధికారులు స్పందించి ప్రధాన రహదారికి మరమత్తులు చేయాలి అని గ్రామ ప్రజలు కోరుతున్నారు.