దివ్యాంగుల హక్కుల కోసం ప్రాణ త్యాగనికైనా సిద్ధం...!

Aug 17, 2024 - 20:23
Aug 17, 2024 - 20:26
 0  28

కోదాడ 18 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పార్లమెంటు సాక్షిగా 2016లో చేసిన చట్టం ప్రకారం దివ్యాంగుల హక్కులను కాపాడుతూ ఖాళీగా ఉన్న బ్యాగ్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ 6000 వెంటనే అమలు చేయాలని కోరుతూ టిడి జేఏసీ చైర్మన్ పివీ చలమయ్య అన్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పి వీ చలమయ్య శనివారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ దివ్యాంగుల హక్కుల సాధన కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని దివ్యాంగుల హక్కులు సాధించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని అన్నారు. దివ్యాంగుల పట్ల స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State