పూసర్ల రజినీకాంత్ 17వ వర్ధంతి సందర్బంగా చీరల పంపిణి.. 

Jul 13, 2024 - 21:38
 0  2
పూసర్ల రజినీకాంత్ 17వ వర్ధంతి సందర్బంగా చీరల పంపిణి.. 

17వ వర్ధంతి సందర్భంగా పూసర్ల రజినీకాంత్ చిత్ర పటానికి సాజిద్ ఖాన్,జ్యోతి కరుణాకర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద వారి మిత్ర బృందం సాజిత్ ఖాన్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసి వారు మాట్లాడుతూ యువజన నాయకుడు రజినీకాంత్ చనిపోయి 17 సంవత్సరాలు అయినప్పటికీ అందరి హృదయాలలో ఉన్నారుని ఖమ్మం రోడ్డు వద్ద గతంలో యూత్ ఆర్గనైజింగ్ చేస్తుండేవారు. చిన్నప్పటి నుండి బాగా తెలుసిన వ్యక్తి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మనిషి దూరమైనప్పటికీ వారిని మర్చిపోకుండా వారి పేరు మీద మంచి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం అని తెలియజేశారు.వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరారు.ఈ కార్యక్రమంలో మిత్ర బృందం ఉప్పల మధు, మీసాల ప్రసాద్, మెరుగు రమేష్, కనుకు ప్రసాద్, నెమ్మది సురేందర్, కనుక బిక్షం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333