పర్యావరణం, అడవులు విస్తరణ కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్
వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ ప్రెసిడెంట్ అర్, రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు పర్యావరణ, అడవుల విస్తరణ కోసం 5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి పిలుపునిచ్చారు. అందులో భాగం గా ఖమ్మం జిల్లా సీడ్ బాల్ ఇంచార్జి రేగురి హనుమంత రావు జిల్లా గవర్నర్ గుమ్మడి వల్లి శ్రీనివాస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా లో సుమారు 10 లక్షలు సీడ్ బాల్స్ తయారు మొదలు అవుతుంది సుమారు 50 క్లబ్స్ ఇందులో పాల్గొంటాయి, స్థానిక నేలకొండపల్లి వాసవి భవన్ లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం విద్యార్థులు, వాసవి క్లబ్ సభ్యులు ఆర్యవైశ్యులు కలిసి రెండు లక్షల సీడ్ బాల్స్ తయారు చేస్తారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధులు గా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మరియు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుంతా రాజగోపాల్ ఈ కార్యక్రమం కుముఖ్య అతిధులు గా విచ్చేయాచున్నారు. నేలకొండపల్లి ఎస్ ఐ సతీష్, ఎంపీడీఓ ఎర్రయ్య, ఏంఅర్ఓ మాణిక్యాల రావు ఈ కార్యక్రమం కు అతిధులు గా విచేయుచున్నారు కావున ఈ కార్యక్రమం ను విజయవంతం చేయవలసిందా గా జిల్లా సీడ్ బాల్స్ ఇంచార్జ్ రే గూరి హనుమంత్ రావు ఒక ప్రకటన లొ తెలియజేసారు.