నల్ల బ్యాడ్జీలను ధరించిన ఉద్యోగులు

Aug 23, 2024 - 14:33
 0  510
నల్ల బ్యాడ్జీలను ధరించిన ఉద్యోగులు

తిరుమలగిరి 23 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం అమలు చేసిన ఆగస్టు 23 కు నిరసనగా సిపిఎస్ ఉద్యమ నాయకులు పొడిచేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత పాఠశాల తాటిపాముల బోధనా సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి బ్లాక్‌ డే గా నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిసిపి ఎస్సిఏ  నాయకులు డాక్టర్ మేడబోయిన లింగయ్య మాట్లాడుతూ ... ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన సిపిఎస్ ను తక్షణమే రద్దు చేసి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు మాశెట్టి శ్రీనివాసులు, తoడు ప్రభాకర్ సంఘీభావం తెలుపగా, ఉద్యోగులు. సీత,. సంతోష్,.బాలకిషన్,. స్వప్న , నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034