తొండలో వడదెబ్బపై అవగాహన

Apr 8, 2024 - 21:08
Apr 9, 2024 - 18:42
 0  174
తొండలో వడదెబ్బపై అవగాహన

తిరుమలగిరి 9 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో వడదెబ్బ గురించి తొండ గ్రామ పంచాయతీ పరిదిలో ఉపాధి హామీ కార్మికులకు వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమం గురించి జిల్లా ఎపిడమజిస్ట్ డాక్టర్ సతీష్ అవగాహన కల్పించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తరువాత పనికి వెళ్ళాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు చెమట పట్టక పోవడం, శరీర ఉషోగ్రత పెరగడం, వణకు పుట్టడం,మగతగా ఉండడం, పిట్ రావడం, పాక్షికంగా అప్ష్మరక లోకి వెళ్ళడం జరుగుతుంది అని వివరించడం జరిగింది.

  తరుచుగా మంచినీళ్ల త్రాగడం, మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, పల్ల రసాలు తీసుకోవాలి సూచించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో బయటికీ వెళితే, కాళ్ళకు చెప్పులు ధరించడం,టోపి,గొడుగు,తేలిక పాటి తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. రోడ్ల పై దొరికే పానీయాలు తీసుకోకూడదని కోరారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు,పోస్ట్ ఆఫీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం యందు వైద్య సేవలు వినియోగించు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో CHO మాలోతు బిచ్చు నాయక్,సూపర్ వైజర్ స్వరూప కుమారి,MLHP డాక్టర్ సమత రాణి,EC వెంకన్న, లలిత, విజయ్, మాధవి ఫీల్డ్ అసిస్టెంట్ గీత,ఆశ కార్యకర్తలు కళమ్మ , మంజుల,ఉమ, భద్ర,పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034