తిరుమలగిరిలో భారీ నగదు పట్టివేత
తిరుమలగిరి 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల సరిహద్దు ఈదుల పర్రె తండ వద్ద పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఇద్దరి వ్యక్తుల నుండి 6లక్షల 29 వేల రూపాయల నగదును చెక్ పోస్ట్ బృందం పట్టుకున్నారు. ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల వెంకన్న కారులో జాజిరెడ్డిగూడెం వెళ్తుoడగా ఒక లక్ష 30 వేల రూపాయలు మరియు గుండాలనుండి తిరుమలగిరికి కారులో వస్తున్న పట్ల రమేష్ నుండి రూ 4లక్షల 99వేల రూపాయల నగదును పట్టుకున్నారు. మొత్తం 6,29,000 రూపాయలను ఏలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎస్ ఎస్ టి టీం లీడర్ నవీన్ కుమార్, సభ్యులు డబ్బులను స్వాధీనం చేసుకొని ఎఫ్ ఎస్ టి టీం లీడర్ శ్రీనివాస్ మరియు సభ్యులకు అప్పగించారు. పట్టుకున్నవారిలో చెక్ పోస్ట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోపి నాయక్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ సైదులు, అసిస్టెంట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.