టెన్త్ ఎగ్జామ్స్‌కు వెళుతుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Mar 18, 2024 - 18:21
 0  17
టెన్త్ ఎగ్జామ్స్‌కు వెళుతుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

జోగులాంబ గద్వాల 18 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు బైక్ అదుపుతప్పి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో నేటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. మానోపాడు మండల పరిధిలోని చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్, మధు అనే ఇద్దరు విద్యార్థులు పదో తరగతి పరీక్షకు బైక్ పై మానోపాడు లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల సెంటర్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో వారి బైక్ అదుపుతప్పింది. 

     ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా మానవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. దీంతో మొదటి రోజు జరిగే పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేకపోయారు. పరీక్ష సెంటర్లు ఉన్న గ్రామాల వైపు బస్సులు లేకపోవడమే ప్రధాన కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు రోడ్డు మార్గం కూడా గుంతలమయంగా ఉండడంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333