కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతి
తెలంగాణ వార్త ప్రతినిది కొండపాక :- కొండపాక ఏప్రిల్ 3 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల అభ్యున్నతి అధ్యయంగా కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు మారబోయిన పరశురాములు అన్నారు. కొండపాకలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైతం మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం అన్నారు. ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్ గౌడ్ , రవీంద్ర నగర్ గ్రామానికి చెందిన అల్లెపు యాదగిరి లకు కిసాన్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులుగా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గణపతి రెడ్డి ఐ ఎన్ టి యు సి సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ సిద్ధిపేట జిల్లా కార్యదర్శిలు కొమ్ము భానుచందు , కుంచెం రవి తదితరులు ఉన్నారు.