డబ్బుల్లేవు-జీతాలు ఇయ్య-మున్సిపల్ కమిషనర్

Apr 3, 2024 - 19:18
Apr 3, 2024 - 21:42
 0  25

జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అసలే కరువు పట్టి పీడిస్తున్న సమయంలో అధికారి కార్మికుల జీతాలు ఇవ్వకుండగా జీవితాలతో చెలగాటమాడుతున్నాడు అంటున్నారు మున్సిపల్ కార్మికులు. గద్వాల్ మున్సిపాలిటీలో పని చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవట. ఈ నెలలో రెండు ముఖ్యమైన పెద్ద పండగలు ఉన్నాయి జీతాలివ్వండని సార్ అంటూ కార్మికులు వేడుకొంటున్న పైసల్లేవు... జీతాలు ఇయ్య అంటున్నారు మున్సిపల్ కమిషనర్. మూడు నెలలవుతుంది జీతాలు లేక ఎంతో కొంత సహాయం చేయండంటూ మున్సిపల్ కార్మికులు ఇంటింటికి తిరిగి డబ్బులు అడుక్కుంటున్నారు. ఏమి ఖర్మరా నాయన జీతాలివ్వని అధికారి గద్వాలకు వచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే వాళ్లకు పైసలివ్వకుండగా ఇబ్బందులకు గురి చేయడం ఏంటని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333