ఎస్. బి. ఐ . ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ ఆధ్వర్యంలో గ్రామ సేవ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్.
జోగులాంబ గద్వాల 20 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లోని మనోపాడు మండలంలోని చెన్నిపాడు, పోతులపాడు గ్రామాలలో జరిగిన ఎస్బిఐ గ్రామ సేవా కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. అలంపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎస్ బి ఐ ఆల్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామ నివాసి అయినా ఆయన ఐదు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ SBI వారు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో SBI అధికారులు,ప్రభుత్వ అధికారులు, గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు