ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమీక్ష ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 30 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎంపీడీవో శంకరయ్య అధ్యక్షతన,వార్డు సభ్యుల పోలింగ్ స్టేషన్ల మరియు ఓటర్లా జాబితాలపై సమావేశము శనివారం రోజు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు,మాజీ సర్పంచులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలతో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.