ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి ఎంపీడీవో.
జోగులాంబ గద్వాల 5ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మండలంలోని ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించింది. ఇకపై ప్రతి సోమవారము రాష్ట్రవ్యాప్తంగా మండలాల్లో చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇటిక్యాలఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు వినతులను ప్రజావాణి పోస్టల్ ద్వారా నమోదు చేసి సంబంధించిన శాఖల సమన్వయతో పరిష్కరించనున్నారని ఇటిక్యాలఎంపీడీవో రమాదేవి తెలిపారు. ఇటిక్యాల మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.