25న అడ్డగూడూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత..ఏఈ బి.ఉమా
అడ్డగూడూరు 24 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. కావున 25 ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని అడ్డగూడూరు మండల విద్యుత్ అధికారి భూక్యా ఉమా తెలిపారు.రైతులు పట్టణ విద్యుత్ వినియోగదారులు గమనించి మాకు సహకరించగలరని బి.ఉమ ఒక ప్రకటనలో తెలిపారు.