శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో రాగి జావా వితరణ.
జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. పట్టణం వేద నగర్ లో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ నందు గత మూడు సంవత్సరముల నుండి రాగి జావా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందని, వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల పిల్లలకు ఎలాంటి వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్తగా మధ్యాహ్నం వారికి ఒక్క గ్లాస్ రాగి జావా ఇవ్వడం జరుగుతుందని, మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు విద్యార్థి , విద్యార్థినులకు ప్రతిరోజు రాగిజావ ఇస్తున్నామని, దాతలుగా రామకృష్ణ మఠం, మరియు గురుదత్త, పాఠశాల కమిటీ వారి సహాయ సహకారాలతో విద్యార్థినులకు మరియు విద్యార్థులకు మా పాఠశాలలో ఉన్న అందరికీ రాగిజావ ఇస్తున్నామని పాఠశాల హెడ్మాస్టర్ జయశ్రీ తెలిపారు.