రాజకీయ ప్రతినిధులతో తహసిల్దార్ సమావేశం.
ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.
జోగులాంబ గద్వాల 31 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల బిఎల్ఈ లతో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా మండలంలో 556 మందిని మృతి చెందిన వారిగా గుర్తించామన్నారు. 10 58 మంది ఓటర్లు స్వాతంత్రంగా బదిలీ అయ్యారని పేర్కొన్నారు. గుర్తింపు బడిన వారు 35 మంది ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ జిపిఓలు తదితరులు ఉన్నారు.