మెడికల్ సీటును సంపాదించిన రామాపురం విద్యార్థి

Sep 30, 2024 - 21:29
Oct 1, 2024 - 08:45
 0  72
మెడికల్ సీటును సంపాదించిన రామాపురం విద్యార్థి

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త  ప్రతినిధి: మండల పరిధిలోని రామపురం గ్రామానికి చెందిన మాసుల్ దార్ బషీర్ కుమారుడు లతీఫ్ హైదరాబాదులో మంగళవారం జరిగిన కౌన్సిలింగ్ లో మెడిసిన్ సీటు సొంతం చేసుకున్నాడు. 
 హైదరాబాదులోని ఆయన్ మైనార్టీ మెడికల్ కాలేజీలో లతీఫ్ కు సీటు వచ్చింది. ఇతనికి మెడిసిన్ లో 497 మార్పులను సాధించి మొదటి కౌన్సిలింగ్ లోనే సీటు సాధించారు. విద్యార్థి తండ్రి బషీర్ ఎంతో కష్టపడి తన కుమారుని డాక్టర్ చేయాలని దృఢ సంకల్పంతో పట్టు  విడువకుండా తన కుమారునికి మెడిసిన్ సీట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్ సాధించిన తల్లిదండ్రులకు విద్యార్థికి గ్రామస్తులు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State