ఫ్లైఓవర్ నిర్మించొద్దంటూ ఎమ్మెల్యేకు వినతిపత్రం

Mar 8, 2024 - 21:58
Mar 9, 2024 - 12:27
 0  394
ఫ్లైఓవర్ నిర్మించొద్దంటూ ఎమ్మెల్యేకు వినతిపత్రం

తిరుమలగిరి, 9 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం నుండి వెళుతున్న తొర్రూరు-వలిగొండ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా స్థానిక చౌరస్తాలో మంజూరైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నిలిపి వేయాలని మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు, ఇంటి యజమానులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు, ఇంటి యజమానులు మాట్లాడుతూ స్వచ్చందంగా సెట్ బ్యాక్ అవుతామని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటాయని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ 300 మంది కుటుంబాలు ప్రైఓవర్ నిర్మాణం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణం ఆపుటకు ఉన్నతాధికారులకు, నేషనల్ అధారిటి హైవే అధికారులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిలిపివేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వై.నరేష్, మూల అశోక్ రెడ్డి, బత్తుల శ్రీను, పాలకుర్తి రాజయ్య, సుంకరి జనార్ధన్, రాపాక సోమేష్, సామ ఆంజనేయులు, గుండా భాస్కర్, గజ్జెల శేఖర్, రాజు, జగిని రాజేశ్వర్, మల్లయ్య, చేను శ్రీనివాస్, నాగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034