ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్

Jul 15, 2024 - 18:40
Jul 15, 2024 - 19:03
 0  64
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్

జోగులాంబ గద్వాల 16 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి (48) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వరులు, నర్సింగరావు లతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికి అప్పడు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State