పట్టించుకోని మైనింగ్ అధికారులు
పట్టపగలే మట్టిని తరలిస్తున్న మాఫియా.
చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు.
జోగులాంబ గద్వాల 20 జూన్2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం వెళ్లే రోడ్డులో అలుప్లెక్స్ కంపెనీ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుట్టలను మట్టి మాఫియా పట్టపగలే గుట్టలను ఖాళీ చేస్తున్న ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్న వారి పై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు మైనింగ్ అధికారులు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం గుట్టలను ఖాళీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతు జిల్లా అధికారులు స్పందించాలని పలువురు కోరారు.