రైతు భరోసా.. నేడే లాస్ట్ డేట్
'రైతు భరోసా' పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 5లోపు పట్టాదారు పాస్బుక్లు పొందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు కొత్తగా 5లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఈవోలకు పాస్బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ ఇస్తే రైతు భరోసా పోర్టల్లో నమోదు చేస్తారు. కాగా వానాకాలం సీజన్కు గాను నిన్నటి వరకు 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేసింది.